Header Banner

గొడ్డలిపోటు దినం.. చెల్లిని గెంటేసిన దినం ఎప్పుడు? టీడీపీ ఎమ్మెల్సీ గ్రీష్మ!

  Mon Jun 02, 2025 08:53        Politics

జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా ప్రకటించిన వైసీపీ నాయకులపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు తమ హయాంలో జరిగిన దౌర్జన్యాలు, కుంభకోణాలు, విధ్వంసకర కార్యకలాపాలను ప్రజలకు గుర్తుచేస్తూ ‘గొడ్డలిపోటు దినం’, ‘సొంత చెల్లిని, తల్లిని గెంటేసిన దినం’, ‘అమ్మ మీద కేసు పెట్టిన దినం’ వంటివి ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆ నరకాసుర పాలన నుంచి విముక్తి కోరుతూ ఓటు వేసి తీర్పు ఇచ్చిన జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా ఎలా ప్రకటిస్తారని గ్రీష్మ ప్రశ్నించారు.


ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!


వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం జనరంజకంగా సాగుతున్న కూటమి పాలనను చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.

ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చి తిరస్కరించినప్పటికీ, వైసీపీ అధినేత జగన్‌‌కు, ఆ పార్టీ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని గ్రీష్మ ధ్వజమెత్తారు. "మద్య నిషేధం అంటూ బూటకపు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక, కల్తీ మద్యంతో వేలాది మంది మహిళల పసుపుకుంకాలు దూరం చేసి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా?" అని జగన్‌ను నిలదీశారు. అలాగే, సీపీఎస్‌ రద్దు చేస్తామని ఉద్యోగులకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి, వారికి వెన్నుపోటు పొడిచింది కూడా మీరే కదా అని గ్రీష్మ ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఇలాంటి చర్యలతో వైసీపీ మరింత అప్రతిష్ఠపాలు కావడం ఖాయమని ఆమె వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!

 

ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..

 
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TDPMLCGreeshma #GreeshmaFiresBack #AxeAttackDay #PoliticalCounter #TDPVsYSRCP #AndhraPolitics